నవతెలంగాణ-పెద్దకోడప్ గల్
బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పేదింటి ఆడపిల్లలకు అందించే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకమును సుప్రీంకోర్టు సాకుతో ఆపే కుట్ర చేస్తుందని దాని వెంటనే పునరుద్ధచి పేద ఇంటి ఆడపిల్లలకు అందివ్వాలని మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేరేంటి ఆడపిల్ల పెండ్లికి కొంత సహాయంగా కేసీఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి కుటుంబాలకు అండగా ఉండే విధంగా ఆర్థికంగా సహకరించిందని అన్నారు. ఆ పథకం రాష్ట్రంలో ఎంతోమందికి సహాయపడిందని తెలిపారు అలాంటి మంచి పథకాన్ని నేడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ వచ్చాక ఆ బతకాన్ని రద్దు చేయాలని కుట్ర పండుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎదగడం కోసం హామీలు ఇవ్వని పథకాలు కూడా అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ కి దక్కిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరు కూడా బాగుపడే దాఖలు లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచుల సాయ గౌడ్,రాజేందర్,మాజీ సర్పంచులు బుషప్ప పటేల్, అశోక్ పటేల్,సీనియర్ నాయకులు సతీష్ యాదవ్ నర్సు పటేల్,సుదీర్,మమ్మద్,లాలయ్య, బన్సీ నాయక్,తదితరులు పాల్గొన్నారు.
రాస్తారోకో ను విరవింపచేసిన పోలీసులు
బిఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తూ రోడ్డుపై బైఠాయించి వచ్చి పోయే వాహనాలను ఆపి నిరసన కార్యక్రమం తెలుపుతున్న బిఆర్ఎస్ పార్టీ నేతలు రవాణాకు ఆటంకం కలిగించవద్దు అనే ఉద్దేశంతో ఘటనా స్థలానికి హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు వారి సిబ్బందితో చేరుకొని రాస్తారోకో నిర్వహిస్తున్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను మీరు రహదారిపై కూర్చోవద్దు వాహనాలకు ఇబ్బంది జరుగుతుంది అని వారికి నచ్చజెప్పి రాస్తారోకోను బందు చేశారు ప్రయాణికులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.



