Saturday, April 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగ్రూప్‌-1 ఆశావహులకు ఊరట

గ్రూప్‌-1 ఆశావహులకు ఊరట

- Advertisement -

సుప్రీం తీర్పును స్వాగతించిన సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ గ్రూప్‌-1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నానని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొలువుల కోసం ఏండ్లకు ఏండ్లు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూసి, కన్నవారి కష్టంపై ఆధారపడలేక, కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో పదేండ్లు కాలం వెళ్లదీసిన గ్రూప్‌-1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట అని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం వచ్చీరావడంతోనే నోటిఫికేషన్‌ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేసిందని గుర్తు చేశారు. ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న దృష్ట శక్తుల కుట్రలను కుతంత్రాలను ఛేదించి, రాష్ట్ర పునర్నిర్మాణంలో తొలి గ్రూప్‌-1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశామని తెలిపారు. వారికి మరోసారి అభినందనలు ప్రకటించారు. ప్రభుత్వ ఆలోచనలు, సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతకు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించి, అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేసిన టీజీపీఎస్సీ చైర్మెన్‌, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -