- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: పశ్చిమాసియా ఘర్షణలు పలు దేశాల్లో ఇంధన సంక్షోభానికి దారితీస్తున్నాయి. దాంతో ఆయా దేశాలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెంచుతుండటంతో సామాన్యులపై భారం పడుతోంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న పాకిస్థాన్.. చమురు ధరలు పెంచి విమర్శల పాలైంది. దాంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరను 80 పాకిస్థానీ రూపాయలు తగ్గిస్తూ రాత్రికి రాత్రే షరీఫ్ ప్రకటన చేయాల్సి వచ్చింది.
- Advertisement -



