– తెలంగాణ రైతు సంఘం మహాసభలో తీర్మానం
కొత్తగూడెం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం(సామినేని రామారావు నగర్-కాసాని అయిలయ్య ప్రాంగణం)లో జరుగుతున్న ఆ సంఘం రాష్ట్ర మూడో మహాసభలో గురువారం ఈ మేరకు తీర్మానించారు. రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రాష్ట్ర నాయకులు వెంకట్రెడ్డి బలపర్చారు. మహాసభ దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నర్సంపేటలో కండక్టర్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వేసిన సబ్కమిటీ వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ ప్రేరేపిత సమ్మె కాదనీ, ఆర్టీసీ కార్మికులు కడుపులు కాలి చేస్తున్న సమ్మె అని చెప్పారు. వారు గొంతెమ్మ కోర్కెలు కోరట్లేదనీ, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మాత్రమే కోరుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వారికి పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎఫ్, ఖాళీ పోస్టుల భర్తీ, బస్సుల కొనుగోలు తదిరత డిమాండ్లలో న్యాయం ఉందని తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



