- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య అందుతుందని శనివారం ఉపాధ్యాయులు బాలకిషన్ అన్నారు. మండలంలోని కన్నాపూర్ ఎంపీ యుపిఎస్ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న 15 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో గల సౌకర్యాలను పిల్ల తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అశోక్, తేజాస్కర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బోయ రేణుక, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -