కలెక్టర్ హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల సమస్యల నుండి వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 41 అర్జీలను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలసి స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవిన్యూ శాఖ 28,జిల్లా పరిషత్ 4, మున్సిపాలిటీ 3,జిల్లా పంచాయతీ శాఖ 2, హౌసింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, పశు వైద్య శాఖ, ఎస్సీ కార్పొరేషన్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES