కృష్ణంరాజు ఆచూకీ కోసం అన్వేషణ
గుంటూరు : సాక్షి టివి ఛానల్ డిబేట్లో రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరావుతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో జర్నలిస్టు కృష్ణంరాజును అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లోని జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావుకు ఎఫ్ఐఆర్ కాపీని ఇచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత విజయవాడకు ఆ తర్వాత గుంటూరుకు తరలించారు.తుళ్లూరుకు తీసుకువెళితే మహిళలు, రాజధాని రైతుల నుంచి తీవ్ర ఆగహావేశాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉన్నందున గుంటూరు రూరల్ నల్లపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. మంగళవారం మంగళగిరి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రాజధాని రైతు నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు శ్రీనివాసరావు, కృష్ణంరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కృష్ణంరాజు ఆచూకీ తెలియరాలేదని, ఆయన పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
సాక్షి కార్యాలయాల ఎదుట నిరసనలు
విజయవాడ, కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి, శ్రీకాకుళంలోని సాక్షి కార్యాలయాల ఎదుట తెలుగు మహిళలు నిరసన తెలిపారు. నోమ్ బోర్డును తొలగించారు. ఆఫీసుల్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్
- Advertisement -
- Advertisement -