అంగన్వాడీల్లో పౌష్టికాహారం..
నవతెలంగాణ – మల్హర్ రావు : అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర మహిళబివృద్ది శిశుసంక్షేమశాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మండలంలోని పెద్దతూoడ్ల, నాచారం, ఆన్ సాన్ పల్లి గ్రామాల్లోని అంగన్ వాడి కేంద్రాల్లో అమ్మమాట..అంగన్ వాడి బాట టీచర్లు అన్నపూర్ణ, రమ, ప్రమీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పౌష్టికాహారంతో పాటు ఆట పాటలతో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు, తల్లిదండ్రులు బడీడు పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించాలన్నారు. అంగన్ వాడీ సెంటర్లో ప్రతి పిల్లవాడు అంగన్వాడీ కేంద్రాల్లోనే చదివే విధంగా టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఆరోగ్యపరంగా కిశోర బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్త లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.
అమ్మబాట..అంగన్ వాడీ బాట.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES