నవతెలంగాణ – తిరువనంతపురం: బంగ్లాపై గంజాయి సాగుచేస్తూ ఓ విదేశీయుడు పట్టుబడ్డాడు. బ్రిటన్కు చెందిన జేసన్ ఉత్తర గోవాలోని సొకారోలో నివాసం ఉంటున్నాడు. అతడు తన ఇంటిపై గంజాయి సాగుచేస్తున్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సమాచారం అందించారు. అతని ఇంటిపై దాడిచేసిన అధికారులు.. ఇతర మొక్కలతోపాటు పూల కుండీల్లో గంజాయి సాగుచేస్తున్నట్లు గుర్తించారు. 33 గంజాయి చెట్లు, 10 గ్రాముల గంజా, రూ.40 వేలు సీజ్ చేశారు. దీంతో కేసు నమోదుచేసి జేసన్ను అదుపులోకి తీసుకున్నారు.