Monday, June 16, 2025
E-PAPER
Homeజాతీయంవిమాన ప్రమాద మృతులకు, క్షతగాత్రులకు ఆర్థిక సాయమందించాలి

విమాన ప్రమాద మృతులకు, క్షతగాత్రులకు ఆర్థిక సాయమందించాలి

- Advertisement -

– టాటాకు ఐఎంఏ లేఖ
అహ్మదాబాద్‌:
అహ్మదా బాద్‌లో విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్లోని విద్యార్థులకు, క్షతగాత్రులకు ఆర్థిక సహాయం అందించాలని టాటా సన్స్‌ను ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) కోరింది. ఈ మేరకు టాటా సన్స్‌ చైర్మెన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది. ‘ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు, గాయపడిన విద్యార్థులకు పరిహారం, సహాయాన్ని అందించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం” అని ఐఏఎం లేఖలో పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బందితో పాటు ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని టాటా గ్రూప్‌ ఇది వరకే ప్రకటించింది. ఆ పరిహారాన్ని చనిపోయిన విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది.
బ్రిటన్‌ జాతీయుల కోసం అహ్మదాబాద్‌లో యూకే రిసెప్షన్‌ సెంటర్‌
అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో 53 మంది బ్రిటన్‌ జాతీయులు మరణించిన విషయం తెలిసిందే. అయితే బాధిత కుటుంబాలు, స్నేహితులకు సహాయాన్ని అందించడానికి భారత్‌లోని బ్రిటిష్‌ హైకమిషన్‌ విమానాశ్రయానికి సమీపంలోని రిసెప్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ రిసెప్షన్‌ సెంటర్‌ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని హైకమిషన్‌ ట్వీట్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -