నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ) ఆధ్వర్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 2 నుండీ మే 11 వరకూ రాష్ట్ర వ్యాపితంగా నిర్వహించనున్న 10 రోజుల ప్రచార కరపత్రాల్లో భాగంగా శనివారం కాటారంలో విడుదల చేయడం జరిగిందని,సమావేశంలో కరపత్రాల ఆవిష్కరణలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ కో కన్వీనర్ రమాదేవి మాట్లాడారు “ప్రజల నిజమైన ఆకాంక్షలను ఎన్నికలలో ప్రచారం లోకి తీసుకు రాకుండా, బీజేపీ నాయకులు, ముఖ్యంగా దేశ ప్రధాని మోడీ ముస్లిం లు, మంగళ సూత్రాలు లాంటి అంశాలను ప్రస్తావిస్తూ, చర్చను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.“గత పదేళ్ళలో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దివాళా తీసిందని, నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు నిత్య జీవిత సమస్యలతో పోరాడుతున్నారని, కానీ వీటిని పట్టించుకోకుండా, మతం, దేవుడు, ముస్లిం ప్రజలపై విద్వేషం పునాదిగా మోడీ ప్రచారం సాగిస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని” ఆమె పిలుపు ఇచ్చారు.బీజేపీ నాయకులు నైతిక విలువలు కూడా విస్మరిస్తున్నారని, బెంగళూర్ లో బీజేపీ భాగస్వామ్య పార్టీ నాయకుడు ఎం.పి స్త్రీలపై జరిపిన అత్యాచారాలు జుగుప్సాకరంగా ఉన్నాయనీ, అటువంటి వ్యక్తికి మోడీ ప్రచారం చేశాడని “ విమర్శించారు. తెలంగాణ ప్రజలు మత సామరస్యంతో శతాబ్ధాల పాటు జీవించారని, ఇప్పడు ఆ సామరస్య వాతావరణాన్ని బీజేపీ నాయకులు విద్వేషంతో నింపుతున్నారనీ, ప్రజలు వాళ్ళ మాయలో పడకుండా ఉండాలని” ఆమె కోరారు.
గత పది సంవత్సరాల నుండి దేశంలో రైతాంగ సమస్యలను పరిష్కరించకుండా, 2019 సంవత్సరం ఎన్నికలలో గెలిచిన వెంటనే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకు వచ్చారన్నారు. రైతాంగ ఉద్యమ ఫలితంగా గత మూడు సంవత్సరాల క్రితం ఈ నల్ల చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. ఈహామీలు అమలు చేయనందునoకు బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించాలనీ, ఇతర పార్టీలను రైతులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.మోడీ ఆర్ధిక విధానాల వల్ల, కోట్లాది మంది బిలియనీర్లు గా మారారని ,దేశ సంపదను దోచుకున్నారని, మిగిలిన ప్రజలు పెదరికంలో కూరుకుపోయారని, దేశంలో ఆర్ధిక వ్యత్యాసాలు బాగా పెరిగిపోయాయని విమర్శించారు. ఏ సమయంలో లోను బీజేపీ ని కేంద్రంలో మళ్ళీ అధికారంలో రాకుండా, ప్రజలు చిత్తుగా ఓడించాలని ఆమె పిలుపు ఇచ్చారు.దేశమంతా ముఖ్యంగా ఉత్తర బారత దేశంలో బీజేపీ వ్యతిరేక గాలులు వీస్తున్నాయని, అందుకే మోడీ మత విధ్వేషాలు రెచ్చగొట్టడానికి పూనుకుంటున్నాడని అన్నారు. దక్షిణాదిలో బీజేపీకి ఏ మాత్రం స్థానం లేకుండా చేయాలని ఆమె కోరారు.స్థానిక యాత్రలు, ర్యాలీలు, సభలు, పత్రికా విలేఖరుల సమావేశాల రూపంలోనూ, కరపత్రాలు, పోస్టర్ల ప్రచారం రూపంలోనూ, వాస్తవ పరిస్థితులను, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించవలసిన అవసరాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్తామని అన్ని మండల కేంద్రాలలో సమావేశాలు ఉంటాయని ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా నాయకులు పీక కిరణ్, అక్కల బాపు యాదవ్, దయ్యం పోచయ్య వావిళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.