నవతెలంగాణ – కంఠేశ్వర్ : నూతన జిల్లా కలెక్టర్, నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు జిల్లా టీ. వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ ని రెడ్ క్రాస్ సభ్యులు శాలువాతో సన్మానించి నోట్ బుక్స్ పెన్నులు శుక్రవారం అందజేశారు. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలు అందజేయడం జరిగింది. ఇటీవల ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని రాజ్ భవన్ లో జరిగిన రక్తదాతల దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకున్నందుకు నిజాంబాద్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ను సభ్యులను కలెక్టర్ అభినందించారు. 67 అత్యధిక సార్లు రక్తదానం చేసి గవర్నర్ నుంచి అవార్డు పొందిన గంగాధర్ శాలువాతో సత్కరించి అభినందించారు. నిజాంబాద్ జిల్లా చైర్మన్ బుస ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కలిపే రవీందర్, జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అబపూర్ రవీందర్, అవార్డు గ్రహీత గదేవర్ గంగాధర్ ,మండల్ జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్లు అబ్బయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నూతన కలెక్టర్ ను కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES