- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో శ్రీ కనక దుర్గాదేవి 11వ వార్షికోత్సవాలను ఆలయాధికారులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో దుర్గమ్మ తల్లిని, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్, బండ ప్రకాష్ , మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డిలు దర్శించుకున్నారు. అదేవిధంగా గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలేరు పట్టణ బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



