- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : అనారోగ్యానికి గురై, విశ్రాంతిలో ఉన్న జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావును మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈరన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కలిసి, యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం యూత్ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేను కలిసిన నాయకులకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిసింది. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని నాయకులు ఎమ్మెల్యేను కోరారు.
- Advertisement -