- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని మసీదులో ప్రతిష్టించిన పేర్లను స్థానిక నాయకుడు సురేష్ గొండ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మొహరం పండుగ పురస్కరించుకొని గ్రామంలోని భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. కులమతాలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్క మహిళలు పెద్దలు చిన్నలు బిపాత్మ పీరు ను ఒడి బయ్యం పోసి ప్రత్యేక వస్త్రాలను ధరింపచేసి నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు, యువకులు ,మహిళలు, భారీ సంఖ్యలో ప్రజలు, పిల్లలు సందర్శించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది.
- Advertisement -



