Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా జైలులో అంతర్జాతీయ యోగా దినోత్సవం 

జిల్లా జైలులో అంతర్జాతీయ యోగా దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర కారాగారం, నిజామాబాదు నందు పర్యవేక్షణాధికారి చింతల దశరథం ఆధ్వర్యంలో 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం శనివారం నిర్వహించారు. కార్యక్రమములో అధికారులు, సిబ్బంది, ఆశ్రమవాసులతో యోగ కార్యక్రమం ను యోగా మాస్టర్ జలందర్ గౌడ్, ప్రాదమిక పాటకాల నీలా, ఉపాద్యాయుడు చేయించి వారి మానసిక, శారీరక ఆరోగ్యం బాగా ఉండేట్లు శిక్షణ ఇచ్చారు. అంతేగాక శిక్ష అనుభవిస్తున్న వారి మనస్సు ద్యానం వైపు ఉండేటట్లుగా పిరమిడ్ స్పిర్చువాల్ సొసైటి మూమెంట్ స్థాపకుడు బ్రహ్మరుషి సుభాష్ పత్రిజీ వారు ధ్యానం అంటే శ్వాస మీద ద్యాస అని చెప్పినారు. ఈ కార్యక్రమంలో  మల్లు గౌడ్, రిటైర్డ్., ప్రదానోపాధ్యాయులు, రజితవాణి, వెంకటేష్, మహేష్ మరియు పతంజలి యోగా కేంద్రం తారపున సాయిలు జిల్లా ఇంచార్జి యోగా మాస్టర్స్ ప్రభాకర్ మరియు కిషన్ పాల్గొన్నారు. కేంద్ర కారాగార అధికారులు డాక్టర్ దినేష్ గంగా,  సాయి సురేష్ బాబు, రాజశేఖర్ రెడ్డి, ఉపిందర్ జైలర్లు,  అనిల్ కుమార్, మన్మద రావు, డిప్యుటీ జైలర్లు, ఎం. అశోక్ కుమార్, నారాయణ ఎ.డి.జె., గార్డింగ్ సిబ్బంది 550 మంది ఆశ్రమవాసులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -