నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలం కంఠాలి గ్రామంలో ప్రభుత్వ ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరూ పేద విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు టై, బెల్టులు, నోటుబుక్కులు, బ్యాగులు సోమవారం విద్యాధికారి తిరుపతయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈవో తిరుపతయ్య, హెచ్ఎం సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ..ఉపాధ్యాయులే స్వంతంగా వితరణ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తోపాటు ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో : –