Tuesday, June 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సొంత ఖర్చులతో పుస్తకాలు పంపిణీ చేసిన ఉపాధ్యాయులు

సొంత ఖర్చులతో పుస్తకాలు పంపిణీ చేసిన ఉపాధ్యాయులు

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ : జుక్కల్ మండలం కంఠాలి గ్రామంలో ప్రభుత్వ ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జట్టి సంతోష్ కుమార్  ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరూ పేద విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు టై, బెల్టులు, నోటుబుక్కులు, బ్యాగులు సోమవారం విద్యాధికారి తిరుపతయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈవో తిరుపతయ్య,  హెచ్ఎం సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ..ఉపాధ్యాయులే స్వంతంగా  వితరణ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తోపాటు ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

ఫోటో : – 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -