– తొగుట సిఐ ఎస్కే లతీఫ్ అన్నారు
నవతెలంగాణ – తొగుట : గ్రామాలలో ప్రజలందరు నిఘానేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని తొగుట సిఐ ఎస్కే లతీఫ్ అన్నారు. సోమవారం మండలంలోని ఘనపూర్ గ్రామంలో పుల్లగుర్ల నరసింహారెడ్డికి సంబందించిన భువనేశ్వ రి ఫర్టిలైజర్ ముందు నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తొగుట ఎస్ఐ రవికాంత్ రావు తో కలిసి ప్రారంభించారు. అనంతరం సిఐ మాట్లా డుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలం దరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామానికి, ఇండ్లకు అనేక సమస్యలకు భద్రత ఉంటుందన్నారు. నిఘా నేత్రా లు ఉండడంవల్ల దొంగతనాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. దీంతోపాటు గ్రామాల్లో జరిగే నేరాల ను అరికట్టవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పోలీసు అధికారి పరమేశ్వర్, గ్రామస్తులు తది తరులు పాల్గొన్నారు.
గ్రామాలలో నిఘానేత్రాలను ఏర్పాటు చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES