నవతెలంగాణ-హైదరాబాద్ : మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోట చేసుకుంది. జిల్లాలోని హావేలి ఘనపూర్ (మం) ఔరంగబాద్ తండాలో రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని కొడవలితో తండ్రి నాలుక కోసేశాడు కసాయి కొడుకు. ప్రభుత్వం అందించిన రైతు భరోసా కింద తండ్రి కీర్యాకు ఓ ఎకరా భూమి ఉండటంతో ఆయన అకౌంట్ లో 6 వేలు రైతు భరోసా డబ్బులు జమా అయ్యాయి. అయితే, అతని అనారోగ్యము దృష్ట్యా అందులో నుంచి 2 వేలు ఆస్పత్రిలో ఖర్చు చేసాడు. అలా ఖర్చు చేసిన అనంతరం 4 వేల రూపాయలను కొడుకు సంతోష్ కి ఇచ్చాడు తండ్రి.
అయితే, తనకి మిగతా 2 వేలు కూడా కావాలంటూ తండ్రి కీర్యాతో సురేష్ గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో కొడుకు సురేష్ ఆగ్రహంతో తండ్రిని కొట్టి కొడవలితో నాలుక కోసేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కీర్యాని మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.