Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: సీఐటీయూ

అంజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్ : భవనిర్మాణ కార్మిక సంఘం వెల్వెర్తి గ్రామ శాఖ అధ్యక్షులు కల్కూరి అంజయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. భవనిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సంతాపం తెలియజేస్తూ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల గౌరవ అధ్యక్షులు తుర్కపల్లి సురేందర్, భవనిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాధారపు మల్లేశం  మాట్లాడుతూ భవనిర్మాణ కార్మికులు కల్కూరి అంజయ్య గత 35 సంవత్సరాల నుండి భవ నిర్మాణ కార్మికుడిగా పని చేసుకుంటూ, అనేక ప్రమాదాల గురి కావడం జరిగిందని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం బాధాకరమని అన్నారు.

అంజయ్య గారు భవనిర్మాణ కార్మిక సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు గత కొంతకాలంగా పనిచేస్తూ కార్మికులకు అనేక సేవలు అందించారని వారు లేకపోవడం కార్మికులకు నష్టం  జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంజయ్య కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవననిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సింగారం వెంకటేశం, మండల నాయకులు ఉక్కుర్తి స్వామి, మొగిలిపాక ఎల్ల స్వామి, చేగురి నగేష్, కలిమిరా సుదర్శన్, ఉక్కుర్తి నాగయ్య, కల్కూరి బాలరాజు, పోలె పాక శంకర్, కలుకూరిశంకరయ్య, బొజ్జ కిష్టయ్య, గుర్రాల రాములు, నగేష నర్సింగ్,ఉక్కుర్తి శీను పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -