నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. ఇటీవల ఉత్తమ్కుమార్రెడ్డి తండ్రి మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో డిప్యూటీ సీఎం విదేశీపర్యటనలో ఉన్నారు. శనివారం మంత్రి ఉత్తమ్ సోదరి రుక్ష్మిణి నివాసంలో ఆయన సోదరుడు గౌతమ్ కుమార్ను కూడా కలిసి సంతాపం, సానుభూతి తెలిపారు. వారి తండ్రి పురుషోత్తంరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.