నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని సోపూరు గ్రామానికి చెందిన గోవిందరావు పటేల్ అంత్యక్రియలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే శనివారం పాల్గొన్నారు. గ్రామానికి చెందిన జర్నలిస్ట్ అర్జున్ పటేల్ గారి తండ్రి గోవిందరావు పటేల్ ఆకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. ఈ విషయం మాజీ ఎమ్మెల్యేకు స్థానిక బిఆర్ఎస్ నాయకులు తెలుపడంతో మాజీ ఎమ్మెల్యే హుటా హుటిన సోపూర్ గ్రామానికి చేరుకున్నారు. అనంతరం అంత్యక్రియలో పాల్గొని, వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియ చేశారు. అంత్యక్రియ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు జుక్కల్ మాజీ ఎంపీపీ భర్త నీలు పటేల్, యువ నాయకుడు వాస్రే రమేష్ , సీనియర్ నాయకులు విట్టు పటేల్, సోపూర్ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అంత్యక్రియలో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES