మండలంలో ఫర్టిలైజర్స్ నిర్వాహకులు డిఎపి అధిక ధరలకు విక్రయించరాదని మండల ఏవో చందన హెచ్చరించారు. బుధవారం మున్సిపల్ పట్టణంలో పలు ఫర్టిలైజర్ దుకాణాలు ఆమె తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు , రిజిస్టర్లు , గోదాములు, ఎమ్మార్పీ ధరలు ఆమె పరిశీలించారు. కొంతమందికి అధిక ధరలకు విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. ఎవరైనా నియ నిబంధనలకు అధికమించినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట ఏఈఓ నాగార్జున ఉన్నారు.