– నాపై మతిలేని ఆరోపణలు : మంత్రి కేటీఆర్
– బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘నేరస్థుడు, మోసగాడు సుఖేష్..నాపై మతిలేని ఆరోపణలు చేశాడు. మీడియా ద్వారా అవి నా దష్టికి వచ్చాయి. సుఖేష్ అనే వాడి గురించి నేనెప్పుడూ వినలేదు. వాడెవడో కూడా నాకు తెలియదు. సుఖేష్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటా. ఈ అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని విజ్ఞపి’ అని మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీ మద్యం కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై తప్పుడు విషయాలతో కేంద్రానికి, సీబీఐకి ఫిర్యాదు చేశాడని ఆ నోటీసులో (మొదటిపేజీ తరువాయి)
పేర్కొన్నారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, బేషరతుగా ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని సుఖేష్ను కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.