నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 3న రైతువేదికలను ముస్తాబు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభం కావడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో దశాబ్ది ఉత్సవాలు, వ్యవసాయ శాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి, రైతాంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఆదేశించారు.