- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు శనివారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎస్కు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా పనిచేసేలా రాష్ట్ర యంత్రాంగాన్ని ముందుకు నడిపించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలు, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులందరికీ చేర్చేలా ముందుకెళ్లాలని సీఎస్కు మంత్రి సూచించారు.
- Advertisement -