Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్

పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోన సముందర్ గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా బట్టు శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బషీరాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన శ్రీనివాస్ బదిలీపై కోన సముందర్ గ్రామ పంచాయతీ  కార్యదర్శిగా విధుల్లో చేరారు. కోన సముందర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న నవీన్ గౌడ్ నుండి నూతన పంచాయతీ కార్యదర్శిగా బట్టు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బట్టు శ్రీనివాస్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్ రెడ్డి, సామ భూమారెడ్డి, సామ మహిపాల్, బట్టల సతీష్, గట్టు హన్మాండ్లు, సందీప్, మహేందర్, చరణ్, నాగరాజు, ముత్యం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img