Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష..

క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మరియు అధికారులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారు లబ్దిదారుల పిర్యాదులు స్వీకరించి, సమస్యలు తెలుసుకొని, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు, అవినీతి, ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించారు. మా ప్రజా ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, పేదోడి సొంతింటి కల నెరవేర్చాలని చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శర వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

మన నియోజకవర్గంలో కూడా దాదాపు అన్ని గ్రామాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో పూరి గుడిసె, పెంకుటిల్లు కనిపించకూడదు అనేదే తన లక్ష్యం అని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అర్హులైన వారు ఇంకా ఎవరైనా ఉన్నా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. లబ్దిదారులు ప్రభుత్వ అధికారుల సూచనలు పాటించి నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. నిర్మాణ దశలను బట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్దిదారుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యేట్లు చూస్తామని అన్నారు. దళారులు ఇష్టారీతిగా ఇసుక రేట్లు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.

వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల అభ్యున్నతి కోసమే పని చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త మీద ఉందని అన్నారు. జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలతో పని చేస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ, అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న అధికారులను ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు , నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad