Saturday, February 21, 2026
E-PAPER
Homeజిల్లాలుసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
పేద ప్రజలకు ఆస్పత్రి ఖర్చులు భారం కావద్దని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేసి ఆదుకోవడం అభినందనీయమని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పోసానిపేటకు చెందిన గాండ్ల శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది, సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా, ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్ రావు సహకారంతో రూ 18,000 చెక్కును, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ బట్టు సత్యనారాయణ, బండి పోచయ్య, గీ రెడ్డి కృష్ణారెడ్డి, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -