Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చదువు వదిలేసిన 10 విద్యార్థులను ఉన్నత విద్యకు ప్రోత్సహించాలి:  కలెక్టర్ ఆదర్శ్ సురభి

చదువు వదిలేసిన 10 విద్యార్థులను ఉన్నత విద్యకు ప్రోత్సహించాలి:  కలెక్టర్ ఆదర్శ్ సురభి

- Advertisement -

 నవతెలంగాణ – వనపర్తి 
 ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి టీసీ తీసుకోని వారిని గుర్తించి వారి వివరాలు కనుక్కొని, వారు ఉన్నత విద్యను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ గోపాల్పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలు రిపోర్టును పరిశీలించి, ఈ ఏడాది వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు వంద శాతం పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి టీసీ తీసుకోని వారిని గుర్తించి వారి వివరాలు కనుక్కొని, వారు ఉన్నత విద్యను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి సామర్థ్యాలను పెంపొందించాలని సూచించారు. గతేడాది కంటే ఈ విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రధానంగా గణితం పై దృష్టి సారించాలని విద్యార్థులకు మెలకువలు నేర్పించాలని చెప్పారు. 

  పీఎం శ్రీ పథకం కింద పాఠశాలలో నిర్మించ తలపెట్టిన సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. స్లాబ్ వేసి వదిలి వేయడంతో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా పీఎం శ్రీ పథకం కింద పాఠశాలకు మంజూరైన మ్యూజిక్ బ్యాండ్ పరికరాలను కలెక్టర్ పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు కావలసిన శిక్షణను సంబంధిత సిబ్బంది నేర్చుకుని విద్యార్థులకు నేర్పించాలని సూచించారు. 

డెంగీ పరీక్షల సంఖ్య పెంచాలి

 గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి.. ఆస్పత్రిలో ఓ పి డి, ఈ డి డి రిజిస్టర్లను తనిఖీ చేశారు. నిత్యం ఆసుపత్రికి జ్వరంతో బాధపడుతూ ఎంతమంది వస్తున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే వారందరికీ డెంగ్యూ టెస్టులు తప్పకుండా చేయాలని ఆదేశించారు. రాట్ పరీక్షల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు. డెంగీ పాజిటివ్ కేసు నమోదు అయిన వారి చికిత్స గురించి, వారి ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డెంగీ నమోదైన పరిసరాల్లో యాంటీ లార్వా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 

        గోపాల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డయాబెటిస్ నిర్ధారణమైన రోగులందరికీ అభా కార్డులు జనరేట్ చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదని చెప్పారు. అదేవిధంగా పి ఎస్ సి లో ప్రసవాల సంఖ్య మెరుగుపరచాలని కలెక్టర్ సూచించారు. నిత్యం వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో కుక్క కాటు, పాముకాటు, డెంగీ వ్యాధికి సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

యూరియా విక్రయాలను జాగ్రత్తగా పర్యవేక్షించాలి

 గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. యూరియా విక్రయాలను వ్యవసాయ అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారు. క్యూలైన్లో నిలబడిన రైతుల్లో ఇదివరకే 30 పైగా సంచులు తీసుకుని వెళ్లిన వారు ఎవరైనా ఉంటే తనిఖీ చేసి వారిని పంపించేసేయాలని సూచించారు. అదేవిధంగా, ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న స్టాక్ కు సంబంధించిన వివరాలను బోర్డులో పెట్టాలని సూచించారు. అందుకు సంబంధించిన బోర్డు అక్కడే ఉండడంతో దానిలో ప్రైవేటు డీలర్ల వద్ద యున్న యూరియా వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా కోసం వచ్చి అక్కడ నిలుచున్న రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, తహసిల్దార్ పాండు నాయక్, మండల విద్యాధికారి, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad