- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలో ఇటీవలే భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పలు గ్రామాలలో ఆదివారం రోజు నాగిరెడ్డిపేట్ పిహెచ్సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ సృజన్ కుమార్ తెలిపారు. 400 మందిని పరీక్షలు నిర్వహించి అవసరమున్నవారికి మందులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
- Advertisement -