- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
మండలంలోని ఆరేపల్లి గ్రామ శివారులోని గల స్మశాన వాటిక దగ్గర మంజీరా నది ఒడ్డు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ను, ముగ్గురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
- Advertisement -