– టైంటేబుల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షలు వచ్చేనెల ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదేనెల 11 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి శనివారం టైంటేబుల్ను విడుదల చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఆరు, ఏడు తరగతుల వారికి ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు జరుగుతాయి. ఎనిమిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహిస్తారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేపడతారు. జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి వచ్చేనెల 30న ఫలితాలను ప్రకటించాలని రాధారెడ్డి తెలిపారు. వాటిని అదేనెల 31న రికార్డుల్లో పొందుపర్చాలని సూచించారు. నవంబర్ ఒకటిన తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి మార్కుల రికార్డులను అందజేయడంతోపాటు విద్యార్థుల పురోగతిపై చర్చించాలని కోరారు. అన్ని జిల్లాల డీఈవోలు ఎస్ఏ-1 పరీక్షల నిర్వహణపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.