30 ఎంపీటీసీ స్థానాలు 7 జడ్పిటిసి స్థానాల్లో సిపిఎం పోటీ
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్
నవతెలంగాణ అచ్చంపేట: త్వరలో జరగనున్న జడ్పిటిసి ఎంపిటిసి గ్రామ సర్పంచ్ ల ఎన్నికలలో సిపిఎం పార్టీ పోటీ చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్ వెల్లడించారు. బుధవారం పట్టణంలో సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ జిల్లా జిల్లా కమిటీ కమిటీ సభ్యుల, మండల కార్యదర్శిల సమావేశం దేశనాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్ మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎంపీటీసీ జడ్పిటిసి, గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఎర్ర జెండాకు ప్రజలు మద్దతుగా నిలవాలని పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రశ్నించే ఎర్రజెండా నాయకులను గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు . నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజులేని పోరాటం నిర్వహిస్తున్న సిపిఎం ఎర్ర జెండాకు ఎన్నికల్లో మద్దతు తెలిపి అత్యధిక స్థానాలను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాల వలన నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారం ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్, బి ఆంజనేయులు, ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు మల్లయ్య, ఎం శంకర్ నాయక్, పరశురాములు, చింతల నాగరాజు, బాలస్వామి, శివ వర్మ, వర్ధం సైదులు, మల్లేష్, తరసింగ్, మధు, రవి, శ్రీనివాస్, దశరథం, నిర్మల తదితరులు పాల్గొన్నారు