Sunday, October 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రయాణికుల జేబులు కొల్లగొట్టాలని చూడటం దుర్మార్గం: కేటీఆర్

ప్రయాణికుల జేబులు కొల్లగొట్టాలని చూడటం దుర్మార్గం: కేటీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఆర్టీసీ బస్సుల్లో చార్జీలను పెంచుతున్నట్లు శనివారం సాయంత్రం టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇప్పటికే పెరిగిన చార్జీలతో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. తాజాగా తీసుకున్న నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం పై రాజకీయ విమర్శలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిగా స్పందిస్తూ.. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై మండిపడ్డారు.

ఆయన తన ట్వీట్‌లో.. సిటీ బస్సు చార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు దుర్మార్గమైనవి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న తరుణంలో.. ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల అదనపు భారం మోపితే బడుగు జీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల బస్ చార్జీలు, టీ-24 టికెట్ చార్జీలను పెంచింది చాలదన్నట్టు.. ఇప్పుడు కనీస చార్జీపై కనికరం లేకుండా 50 శాతం టిక్కెట్టు ధరలను పెంచడం రేవంత్ అసమర్థ విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -