- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం లో కొన్ని రోజుల క్రిందట రోడ్డు ప్రమాదంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు పంతకాని వినయ్ మరణించాడు. శుక్రవారం రోజునా వారి దశ దిన కర్మ కార్యక్రమం లో పాల్గోని వినయ్ కీ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వినయ్ పిల్లలను ఓదార్చి, అతని తల్లిదండ్రులతో మాట్లాడి మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమం లో కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, భూపెల్లి రాజు,కుమ్మరి రమేష్, ఆత్మకూరి కుమార్ యాదవ్, మరుపాక రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -