నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణానికి చెందిన సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్, న్యాయవాది గటాడి ఆనంద్ ను ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది లోక భూపతిరెడ్డి మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో 2005 సంవత్సరం అక్టోబర్ 12 న ప్రజల చేతిలో వచ్చినటువంటి బ్రహ్మాస్త్రం, రామ బాణమే సమాచార హక్కు(సహ) చట్టం ఈ సహ చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుందని అన్నారు.
గటడి ఆనంద్ గత 15 సంవత్సరాలుగా నిరంతరం ప్రజలలో ఉంటూ విద్యార్థులకు ఆయా గ్రామాలలో ఉన్న గ్రామాభివృద్ధి కమిటీలకు ఈ యొక్క సమాచార హక్కు చట్టం యొక్క విశిష్టతను తెలియజేస్తూ వారికి కావలసినటువంటి సమాజాన్ని ఇవ్వడమే కాకుండా వారికి సహకరించి వారికి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రయోజనాలు కల్పించడం జరగడం జరిగిందని అన్నారు. వారు సుదీర్ఘంగా ఈ యొక్క ప్రయత్నం చేయడం చాలా అభినందనీయమని, ఇదే విధంగా సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు చేరువ చేయడంలో కుదురుక్తులు కావాలని తెలియజేస్తూ వారికి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ గటడి ఆనంద్ మాట్లాడుతూ… తనను సన్మానించిన బార్ అసోసియేషన్, సీనియర్ న్యాయవాదైన లోక భూపతిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తాను చేసేటటువంటి సమాచార హక్కు చట్ట కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ. దీన్ని మరింత ముందుకు ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించడం, వారికి ఏదైనా అన్యాయం జరుగుతే న్యాయం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్,ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .