పట్టణంలో ఘనంగా కామ దహన కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కామ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆంజనేయ శర్మ పంతులు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్ తో ప్రత్యేక పూజలు చేయించారు. కామ దహన కార్యక్రమం జరిగింది. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో కాముని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కమిటీ ద్వారా అందరికి గుడాల ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్బంగా కాలనీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కామ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, కాలనీ సభ్యుల ఇళ్లకు గుడాలను పంపిణి చేస్తున్నామని తెలిపారు. కాలనీవాసులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీలోని పిల్లలు, పెద్దలు ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు. కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, హనుమాన్ ఆలయ అధ్యక్షుడు శివరాజ్ కుమార్, కాలనీ ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, సుంకే శ్రీనివాస్, కార్యదర్శులు కొంతం రాజు, ఎల్.సాయన్న, రాజ్ కుమార్, కాలనీ పెద్దలు గడ్డం శంకర్, ఎర్ర భూమయ్య, ఎల్ టీ కుమార్, ముత్తెన్న, నరహరి, గణపతి, ఎస్సారెస్పీ డీఈ గణేష్, డీ.జె.దయానంద్, సతీష్, బొల్లు జీవన్, భూమేశ్వర్, నారాయణ, రవి, గోపి, ఖదీర్, భాజన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love