భారీ నగదు పట్టివేత

నవతెలంగాణ – నిజాంసాగర్

నిజంసాగర్ మండల కేంద్రంలోని బ్రాహ్మణపల్లి శివారులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద బుధవారం రాత్రి 10 గంటల సమయంలో భారీగా నగదు పట్టుకోవడం జరిగిందని ఎస్సై సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ నుండి తన ఐచర్ వాహనంలో రూ.53,42,830 రూపాయలను తీసుకెళ్తూ పట్టుబడ్డాడని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం నగదుకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపెట్టకపోవడం వలన అట్టి నగదును సీజ్ చేసి ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అప్పగిస్తామని ఆయన తెలిపారు.
Spread the love