ఏడో విడత నీటి విడుదల..

నవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి ఏడో విడత నీటిని సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆదివారం వరకు నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ ఇంజనీర్ శివ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో నీటి నిలువలు తక్కువగా ఉన్నాయి. కావున రైతులందరూ కూడా నీటి నీ వృధా చేయకుండా సక్రమంగా పంట సాగు కోసం వినియోగించుకోవాలని ఆయన అన్నారు. డిస్ట్రిబ్యూటర్ల కాలువల గేట్లు అక్రమంగా ఎవరైనా తెరిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని ఆయన అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.171 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఇదే చివరి నీటి విడుత అని ఆయన అన్నారు.
Spread the love