డీజేలో డ్యాన్సు వద్దు అన్నందుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి

నవతెలంగాణ – నిజాంసాగర్
నిజాంసాగర్ మండలంలోని చిన్న ఆరేపల్లి గ్రామంలో అనిల్ అనే వ్యక్తి (28) క్షణికావేశంలో ఉరివేసుకొని మరణించాడు. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం అనిల్ బంధువుల పెళ్లి ఆరేపల్లి గ్రామంలో జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన డీజేలో డాన్స్ చేయడానికి భార్యకు అడగక ఆమె నిరాకరించింది. దానితో ఇద్దరి మధ్య గొడవ జరిగి అతను బయటకు వెళ్లి మద్యం సేవించి మనస్థాపం చెంది చెట్టుకు ఉరివేసుకొని క్షణికావేశంలో మరణించాడు. అతని తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.

Spread the love