నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడా వెస్ట్లోని రెసిడెన్షియల్ సొసైటీకి చెందిన రెండు ఫ్లాట్స్లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గౌర్ సిటీ 16 అవెన్యూలోని రెండు ఫ్లాట్స్లో గురువారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.