నవతెలంగాణ భోపాల్: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పుర్కు దగ్గర్లో ఉన్న అమరవాడా ప్రాంతంలో మంత్రి కాన్వాయ్ రాంగ్ రూట్లో వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా… మంత్రి ప్రహ్లాద్ పటేల్, ఆయన వ్యక్తిగత కార్యదర్శికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. బైక్పై ప్రయాణిస్తున్న వారిలో చిన్నారికి తీవ్ర గాయాలు కాగా దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రహ్లాద్ పటేల్ నర్సింగ్పుర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నర్సింగ్పుర్కు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.