మెప్పించే పురుషోత్తముడు

మెప్పించే
పురుషోత్తముడురాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై డా.రమేష్‌ తేజావత్‌, ప్రకాష్‌ తేజావత్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. రామ్‌ భీమన దర్శకుడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు. హీరో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ, ‘జూన్‌ 6న రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాం. సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ పూర్తయ్యాక డేట్‌ అనౌన్స్‌ చేస్తాం. మా మూవీని థియేటర్స్‌లో చూసి ఎంకరేజ్‌ చేయండి’ అని తెలిపారు. ‘ఒక మంచి మూవీ చేశామని బిలీవ్‌ చేస్తున్నాం. థియేటర్స్‌లో మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. త్వరలో రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తాం’ అని నిర్మాతలు ప్రకాష్‌ తేజావత్‌, డా.రమేష్‌ తేజావత్‌ అన్నారు. దర్శకుడు రామ్‌ భీమన మాట్లాడుతూ, ‘రాజ్‌ తరుణ్‌ని కొత్తగా తెరపై ప్రెజెంట్‌ చేసే చిత్రమిది. ఒక ఐ ఫీస్ట్‌ లాంటి సినిమాను చూడబోతున్నారు’ అని తెలిపారు.

Spread the love