కవి కాలంతో పాటు నడవాలి

– కాలోజీ పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి
నవతెలంగాణ –  భువనగిరి రూరల్ 
కవి సామంతర  కాలాన్ని అధ్యయనం చేస్తూ దానితోపాటు కలిసి అడుగులు వేసినప్పుడే అత్యుత్తమ కవిత్వాన్ని అందించగలుగుతాడని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాకవి పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం రాయగిరి ఉన్నత పాఠశాల ఆవరణలో భువనగిరికి చెందిన కవి నిశ్రాంత ఉపాధ్యాయులు తోట వెంకటేశ్వరరావు వచన కవితా సంపుటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోట్ల వెంకటేశ్వర రెడ్డి హాజరై, గ్రంధాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యత కలిగిన తోట వెంకటేశ్వరరావు గత కొన్ని దశాబ్దాలుగా మంచి కవిత్వం రాస్తూ వస్తున్నారని, ఆ క్రమంలో భిన్న వస్తువులను తీసుకొని తనదైన శైలిలో మంచి కవిత్వం రాస్తూ సాహిత్య ప్రియుల అభిమానాన్ని చిరగొంటున్న ఘనత తోట వెంకటేశ్వరరావుకు దక్కుతుందన్నారు. జిల్లా రచయితల సంఘం ప్రచార భారతి సంయుక్త నిర్వహణ నిర్వహించిన ఈ గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమానికి రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో చాలా కుల శ్రీకాంత్, దేవినేని అరవిందరాయుడు, పెసరు లింగారెడ్డి, బండారు జయశ్రీ, డాక్టర్ పాండాల మహేశ్వర్, గజ్జల రామకృష్ణ, బండి సూర్యారావు పలువుల సతీష్ ,బాలకొండ శ్రీరాములు,  అనిత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love