పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ-శంకరపట్నం
శ్రీ లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ ఉన్నంత పాఠశాల తాడికల్ లో చదివిన పూర్వ విద్యార్థులు 1994-95 వ సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా అలనాటి గురువులు కాళిదాసు, రామయ్య, ఐలయ్య,లను పూర్వ విద్యార్థులు  ఘనంగా చాలువలతో సన్మానిచారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ,జీవితానికి అర్థం తెలిపిన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన గురువుల రుణం ఏనాటికి తీర్చుకోలేమని  పూర్వ  విద్యార్థిని,విద్యార్థులు,ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చింతి రెడ్డి రమణారెడ్డి, ఓదెల దేవరాజ్, కాంతాళ రాజిరెడ్డి,పోలోజు సత్యనారాయణ,వడ్నాల కోటి,బత్తిని శ్రీనివాస్, ఎండి మన్నన్, కరివేదా కవిత, మందటి వనజ, సరోజన, సునీత, తిరుమల, ఉపాధ్యాయులు తోటి స్నేహితులు 48 మంది అలనాటి విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.

Spread the love