ప్రభుత్వ సలహాదారును కలిసిన ఐఎన్ టీయూసీ జాతీయ నాయకుడు

నవతెలంగాణ – గోదావరిఖని
రామగుండంకు చెందిన హర్కరా వేణుగోపాలరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సందర్భంగా ఐఎన్ టీయూసీ జాతీయ నాయకుడు మాజీ మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ బాబర్ సలీం పాష హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈసందర్భంగా శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపు రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. రామగుండానికి చెందిన వేణుగోపాలరావుకు ఉన్నత పదవి దక్కడం పట్ల బాబర్ సలీం పాష హర్షం వ్యక్తం చేశారు.
Spread the love