కొనసాగుతున్న బూడిద లారీ ఓనర్ల సమ్మె

నవతెలంగాణ – గోదావరిఖని
గత వారం రోజులుగా అంతర్గాం మండల పరిధి కుందనపల్లి శివారులోని ఎన్టీపీసీ యాష్ పాండ్ లో స్థానిక బూడిద లారీ ఓనర్లు సమ్మె చేస్తున్నారు. బూడిద తరలింపు కోసం టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు దూర ప్రాంతాల నుంచి లారీలు తీసుకువచ్చి బూడిద రవాణా చేస్తుండగా, తమకు ఉపాధి పోతుందని స్థానిక లారీ యాజమానులు ఈ సమ్మెను కొనసాగిస్తున్నారు. గతంలో ఇటుక బట్టీలకు తమ లారీలతో బూడిద రవాణా చేయగా, ప్రస్తుతం ఓ కాంట్రాక్టర్ ఇటుక బట్టీలకు తన సొంత లారీలతో బూడిద రవాణా చేస్తుండటంతో తమకు ఉపాధి దొరకక, తాము లారీల ఫైనాన్స్లు, డ్రైవర్ల జీతాలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ యాజమాన్యం వె ంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మెలో లారీ అసోసియేషన్ నాయకులు సంపం గి శ్రీనివాస్, శివరాత్రి గంగాధర్, కొమురయ్య, శ్రావణ్, కుమార్ తదితరులున్నారు.
Spread the love