ఇటుక బట్టీలో లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీసులు విచారణ 

నవతెలంగాణ-రామగిరి : ఇటుక బట్టీలో పనిచేసే కార్మికులపై యజమానులు దాడి  చేస్తున్నారని కథనం ను వార్త లో ప్రచురించింది. దీనికి స్పందించిన జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇటుక బట్టీ యజమానులతో విచారణ చేశారు. ఇటుక బట్టి యజమానులు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు రామగిరి ఎస్సై కటిక రవి ప్రసాద్ కి కటిక రవి ప్రసాద్ కి ఫోన్ లో సమాచారం అందించారు. ఎస్సై కటికే రవిప్రసాద్ రంగప్రవేశంతో వాగ్వివాదం ముగిసింది. ఇటుక బట్టి కార్మికులను వారి సొంత గ్రామానికి పంపిస్తామని యజమానులు హామీ ఇచ్చారు. రామగిరి ఎస్సై కటికే రవిప్రసాద్ రంగప్రవేశంతో యజమానులు కార్మికులను విముక్తి చేశారు.
Spread the love