– ఓయూలో ఘటన
నవతెలంగాణ-ఓయూ
ఎంసెట్లో అర్హత సాధించలేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ ఓయూలో గురువారం జరిగింది. సీఐ జుట్టు భాస్కర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ న్యూనల్లకుంటకు చెందిన శ్రీకృష్ణ చైతన్య(18) డీడీ కాలనీలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఎంపీసీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఎంసెట్ ఫలితాల్లో అతను అర్హత సాధించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. సైకిల్ తీసుకుని ఓయూ క్యాంపస్కు వెళ్లిన అతను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 80 శాతం గాయాలతో ఉన్న విద్యార్థిని చూసిన ఓ వ్యక్తి ఓయూ సెక్యూరిటీ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చైతన్యను గాంధీ ఆస్పత్రికి తరలించి అతని తండ్రికి సమాచారం అందించారు. పరిస్థితి విషమించి విద్యార్థి మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.